దేశవ్యాప్తంగా రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. మంగళవారం నాడు హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నిన్న కొవాక్జిన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాను. ఎలాంటి ఇబ్బంది లేదు. అర్హత కలిగిన వారంతా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నాను. కరోనా వాక్సిన్ కోసం http://cowin.gov.in లో నమోదు చేసుకోవచ్చు. త్వరగా కరోనా వ్యాక్సిన్ తీసుకోడాన్ని పూర్తి చేయండి” అని నాగార్జున పేర్కొన్నారు.
మరోవైపు కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 60వ రోజైన మార్చి 16, మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 21.1 లక్షలకుపైగా (21,17,104) కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అలాగే బుధవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 3.5 కోట్లు (3,50,64,536) దాటినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ