పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతపోరాడినా అధికారం దక్కించుకోలేని బీజేపీ పార్టీకి, ఆ రాష్ట్రంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర బీజేపీలో కీలకంగా వ్యవహరించిన నేత, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ శుక్రవారం నాడు టీఎంసీలో చేరారు. ముకుల్ రాయ్ తో పాటు ఆయన కుమారుడు సుబ్రాన్షు కూడా టీఎంసీ అధినేత, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమక్షంలో పార్టీలో చేరి, టీఎంసీ కండువా కప్పుకున్నారు.
గతంలో టీఎంసీలో కీలక నేతగా ఎదిగి, మమతా బెనర్జీకి అత్యంత నమ్మకంగా ఉన్న ముకుల్ రాయ్, పార్టీలో విబేధాలు కారణంగా 2017లో టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనంతరం ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి, తదనంతర పరిస్థితుల వలన ఒత్తిడి ఎదుర్కొలేకే మళ్ళీ సొంతగూటికి చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ముకుల్ చేరికపై మమతా బెనర్జీ స్పందిస్తూ మా కుటుంబానికి చెందిన పాత కుర్రాడే మళ్ళీ తిరిగివచ్చాడని, పార్టీలో ముకుల్ రాయ్ కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ నుండి ఎక్కువ మంది నాయకులు టీఎంసీ పార్టీలోకి చేరతారని, అయితే డబ్బుల కోసం ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన వారిని, పార్టీని ఇష్టమొచ్చినట్టు దూషించిన వారిని తిరిగి తీసుకోమని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ