కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ బుధవారం వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై సర్ గంగారాం ఆసుపత్రి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. “వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరిన యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ పరిస్థితి నిలకడగా ఉంది, ఆమె క్రమంగా కోలుకుంటున్నారు” అని సర్ గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.
సోనియా గాంధీ డిసెంబర్ 24న ఢిల్లీలో జరిగిన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ లో పాల్గొన్నారు. అలాగే డిసెంబర్ 28న కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు. అనంతరం మంగళవారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE