భారతీయ సంఘసంస్కర్త, విద్యావేత్త మరియు కవయిత్రి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “స్పూర్తిదాయకమైన సావిత్రీబాయి ఫూలే జీ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తున్నాను. ఆమె మన నారీ శక్తి యొక్క తిరుగులేని స్ఫూర్తిని వ్యక్తీకరించింది. ఆమె జీవితం మహిళలకు విద్య మరియు సాధికారత కోసం అంకితం చేయబడింది. సామాజిక సంస్కరణ మరియు సమాజ సేవపై ఆమె దృష్టి కేంద్రీకరించడం కూడా అంతే స్ఫూర్తిదాయకం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
దేశంలో కుల వివక్షతకు, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా సావిత్రిబాయి ఫూలే పోరాడారు. మహిళల హక్కులను మెరుగుపరచడంలో, మహిళ విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. దేశంలో తొలితరం మహిళా ఉద్యమకారిణిగా, మార్గదర్శకురాలిగా సావిత్రిబాయి ఫూలే గుర్తింపు పొందారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE