జూన్ 13, శనివారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,08,993 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 7,135 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 1,54,329 కు చేరింది. మొత్తం బాధితులలో కోలుకున్నవారి శాతం 49.95% గా నమోదైంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో 1,45,779 మంది చికిత్స పొందుతున్నారు.
దేశంలో కరోనా వైరస్ సోకిన వారిని పరీక్షించేందుకు పరీక్షల సామర్థ్యాన్ని భారతీయ వైద్య పరిశోధనామండలి (ఐసిఎంఆర్) మరింతగా పెంచింది. ప్రభుత్వ లేబరేటరీల సంఖ్య తాజాగా 642 కి చేరుకోగా, ప్రైవేట్ లాబొరేటరీస్ సంఖ్య 243 కి పెరిగింది. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించే మొత్తం లాబ్స్ సంఖ్య 885 అయింది. కాగా గడిచిన 24 గంటల్లో 1,43,737 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 55,07,182 కు చేరింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu