మహారాష్ట్ర రాష్ట్రంలో రోజురోజుకి కరోనావైరస్ తీవ్రత పెరుగుతుంది. గత కొన్నిరోజులుగా ఒకేరోజు వ్యవధిలో భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 21, శుక్రవారం నాడు ఒక్కరోజే కొత్తగా 14,161 కరోనా పాజిటివ్ కేసులు, 339 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,450 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 21,698 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 11,749 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 4,70,873 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,64,562 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu