మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30, బుధవారం నాడు కొత్తగా 18,317 కరోనా పాజిటివ్ కేసులు, 481 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13,84,446 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 36,662 కు పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికి 67,85,205 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (సెప్టెంబర్ 30, బుధవారం నాటికీ):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 13,84,446
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 10,88,322
- యాక్టీవ్ కేసులు – 2,59,033
- సెప్టెంబర్ 30 న నమోదైన కేసులు – 18,317
- సెప్టెంబర్ 30 న డిశ్చార్జ్ అయినవారు – 19,163
- సెప్టెంబర్ 30 న నమోదైన మరణాల సంఖ్య – 481
- మొత్తం మరణాల సంఖ్య – 36,662
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu