మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జూన్ 28, మంగళవారం నాడు 3,482 కరోనా కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 79,68,517 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,47,915 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 3,566 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 77,95,121 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.82 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.85 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 25,481 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి మహారాష్ట్రలో 8,19,13,852 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY