తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) తాజాగా గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం టీఎస్పీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. “నోటిఫికేషన్ నెం.28/2022 ప్రకారం గ్రూప్-2 సర్వీసెస్ (జనరల్ రిక్రూట్మెంట్) పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు, 2023, ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలను నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. అభ్యర్థులు తమ హాల్-టికెట్ను కమిషన్ వెబ్సైట్లో (www.tspsc.gov.in) పరీక్ష తేదీకి ఒక వారం ముందు డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నాం” అని టీఎస్పీఎస్సీ పేర్కొంది.
మరోవైపు గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16న ముగియడంతో, 783 గ్రూప్-2 పోస్టులకు గానూ మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో గ్రూప్-2 కి సంబంధించి ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ పడనున్నారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, నాయిబ్ తహసీల్దార్ సహా పలు విభాగాలకు చెందిన పోస్టులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE