ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16న ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్-2022 కోసం ఇంగ్లాండ్ మెన్స్ సెలక్షన్ ప్యానెల్ 15 మందితో కూడిన ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్ టీ20 జట్టుకు జోస్ బట్లర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. కాగా జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్ మరియు మాట్ పార్కిన్సన్ కు ఈ 15 మంది జాబితాలో చోటు దక్కలేదు. ఇక సీమ్ బౌలర్లు క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ వారి సంబంధిత గాయాల నుండి కోలుకుని ఐసీసీ టీ20 ప్రపంచకప్ మరియు సెప్టెంబర్లో పాకిస్తాన్లో జరిగే టీ20 పర్యటన కోసం ఎంపిక రెండు జట్టులలో చోటు దక్కించుకున్నారు.
జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా ఈ ప్రపంచకప్ కు కూడా దూరమయ్యాడు. మరోవైపు ఈ నెలాఖరులో కరాచీలో జరగనున్న ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్ పాకిస్థాన్ పర్యటన కోసం ఇంగ్లాండ్ మెన్స్ సెలక్షన్ ప్యానెల్ 19 మంది ఆటగాళ్లతో కూడిన ఇంగ్లాండ్ జట్టును కూడా ప్రకటించింది. పాకిస్తాన్ తో సిరీస్ కోసం కెంట్కు చెందిన జోర్డాన్ కాక్స్, మిడిల్సెక్స్కు చెందిన టామ్ హెల్మ్లకు కొత్తగా అవకాశాలు దక్కింది.
ఇంగ్లాండ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్-2022 జట్టు:
- జోస్ బట్లర్ (కెప్టెన్)
- మొయిన్ అలీ
- జోనాథన్ బెయిర్స్టో
- హ్యారీ బ్రూక్
- సామ్ కర్రాన్
- క్రిస్ జోర్డాన్
- లియామ్ లివింగ్స్టోన్
- డేవిడ్ మలన్
- ఆదిల్ రషీద్
- ఫిల్ సాల్ట్
- బెన్ స్టోక్స్
- రీస్ టోప్లీ
- డేవిడ్ విల్లీ
- క్రిస్ వోక్స్
- మార్క్ వుడ్
ట్రావెలింగ్ రిజర్వ్లు:
- లియామ్ డాసన్
- రిచర్డ్ గ్లీసన్
- టైమల్ మిల్స్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY