కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన పదో రోజుకి చేరుకుంది. రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు ఇప్పటికే రెండుసార్లు జరిపిన చర్చలు ఫలించలేదు. ఈ క్రమంలో చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను తీవ్రతరం చేయడంలో భాగంగా డిసెంబర్ 8 వ తేదీన భారత్ బంద్ కోసం రైతులు పిలుపునిచ్చారు. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం రెండుగంటలకు ఢిల్లీలో కేంద్రమంత్రులు, రైతుల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులతో సమావేశానికి ముందుగా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో రైతుల ఆందోళనకు సంబంధించి తాజా పరిస్థితులు, చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తునట్టుగా సమాచారం. ఈసారి చర్చల్లో కూడా తమ డిమాండ్లను నెరవేరకపోతే ఆందోళనన మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ