ఆదివారం జరిగిన ఆఖరి టీ20లోనూ టీమిండియా అదరగొట్టింది. చివరిదైన మూడో మ్యాచ్లో భారత జట్టు శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ విజయం ద్వారా టి20లలో 12 వరుస విజయాలు సాధించి అఫ్ఘానిస్థాన్తో కలిసి అగ్ర స్థానంలో ఉంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. కెప్టెన్ షనక (38 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 నాటౌట్) అర్ధసెంచరీతో సత్తా చాటాడు. చాందిమల్ 22 పరుగులు చేసి తన వంతు సహకారం అందించాడు. అవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీసాడు.
అనంతరం ఛేదనలో భారత్ 16.5 ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసి గెలిచింది. శ్రేయాస్ అయ్యర్ (45 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్తో 73 నాటౌట్) మరోసారి హాఫ్సెంచరీతో మెరిశాడు. రవీంద్ర జడేజా (22 నాటౌట్) తోడుగా అయ్యర్ జట్టుని విజయతీరాలకు చేర్చాడు. కాగా, శ్రేయాస్కు ఈ సిరీస్ లో ఇది వరుసగా మూడో హాఫ్సెంచరీ కావటం విశేషం. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్గానూ శ్రేయాస్ నిలిచాడు. అలాగే, అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా రోహిత్ (125 మ్యాచ్లు) నిలిచాడు. మరోవైపు టీ20ల్లో శ్రీలంకపై భారత్కిది 17వ విజయం. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా.. న్యూజిలాండ్, వెస్టిండీస్ తర్వాత శ్రీలంకపై క్లీన్స్వీప్ సాధించింది.
స్కోరుబోర్డు
శ్రీలంక: నిస్సాంక (సి) వెంకటేశ్ (బి) అవేశ్ 1; గుణతిలక (బి) సిరాజ్ 0; అసలంక (సి) శాంసన్ (బి) అవేశ్ 4; లియనగె (బి) బిష్ణోయ్ 9; చాందిమల్ (సి) వెంకటేశ్ (బి) హర్షల్ 22; షనక (నాటౌట్) 74; కరుణరత్నె (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు: 24; మొత్తం: 20 ఓవర్లలో 146/5.
బౌలింగ్: సిరాజ్ 4-0-22-1; అవేశ్ 4-1-23-2; హర్షల్ 4-0-29-1; కుల్దీప్ 4-0-22-0; బిష్ణోయ్ 4-0-32-1.
భారత్: శాంసన్ (సి) చాందిమల్ (బి) కరుణరత్నె 18; రోహిత్ (సి) కరుణరత్నె (బి) చమీర 5; శ్రేయాస్ (నాటౌట్) 73; దీపక్ హుడా (బి) లాహిరు 21; వెంకటేశ్ (సి సబ్) జయవిక్రమ (బి) లాహిరు 5; జడేజా (నాటౌ ట్) 22; ఎక్స్ట్రాలు: 4; మొత్తం: 16.5 ఓవర్లలో 148/4.
బౌలింగ్: ఫెర్నాండో 4-0-35-0; చమీర 3-0-19-1; లాహిరు 3.5-0-39-2; కరుణరత్నె 3.4-0-31-1; వాండర్సే 2.2-0-24-0.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ