ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన జవహర్రెడ్డి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విధుల్లో చేరారు. జవహర్రెడ్డి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం గత వారంలో ఎనిమిది మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ క్రమంలోనే.. సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డిని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయితే, దీనితోపాటు టీటీడీ ఈఓ పదవిలో కూడా జవహర్ రెడ్డి కొనసాగుతారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ మొదటి వారంలో ఏపీలో మరోసారి బదిలీలు జరగొచ్చని వార్తలు విన్పిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ