భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 60 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 24 లక్షలు దాటింది. ఆగస్టు 14, శుక్రవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 24,61,190 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 64,553 కరోనా పాజిటివ్ కేసులు, 1007 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 48,040 కు చేరింది. ఇక దేశంలో మరణాల రేటు 1.95 శాతంగా ఉంది.
మరోవైపు గత 24 గంటల్లో 55,573 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 17,51,555 కు చేరుకుంది. దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నపటికి కోలుకుంటున్న వారి శాతం ఎక్కువ ఉంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 71.17 శాతంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో మొత్తం 6,61,595 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు కరోనా మరణాలు ఎక్కువుగా నమోదవుతున్న దేశాల్లో బ్రిటన్ ను దాటేసి భారత్ నాలుగో స్థానానికి చేరింది. అలాగే అత్యధిక కరోనా కేసులలో అమెరికా, బ్రెజిల్ దేశాల తర్వాత భారత్ మూడో స్థానంలో కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu