దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 13, సోమవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 8,78,254 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 28,701 కరోనా పాజిటివ్ కేసులు, 500 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒకరోజు వ్యవధిలో అత్యధికంగా ఇన్ని కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అయితే గత ఐదు రోజులుగా ప్రతిరోజూ 25 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి.
అలాగే దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 23,174 కి చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 5,53,471 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 3,01,609 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నపటికి కోలుకుంటున్న వారి శాతం ఎక్కువ ఉంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 63.02 శాతంగా ఉన్నట్టు ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఆదివారం నాడు మహారాష్ట్రలో 7,827 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తమిళనాడులో 4244 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
(As on 13 July, 2020, 08:00 AM)▶️ Confirmed cases: 878,254
▶️ Active cases: 301,609
▶️ Cured/Discharged/Migrated: 553,471
▶️ Deaths: 23,174#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHIVia @MoHFW_INDIA pic.twitter.com/oRaqoIaX4s
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) July 13, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu