దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు 3 వేల కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,528 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,04,005 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 149 మంది మరణించడంతో మరణాల సంఖ్య 5,16,281 కి పెరిగింది. ఇక దేశంలో కొత్తగా 3,997 కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,24,58,543 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.73 శాతంగానూ, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ప్రస్తుతం 29,181 (0.07%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక గత 24 గంటల్లో కేరళ (922), మహారాష్ట్ర (229), మిజోరాం (228), ఢిల్లీ (148), కర్ణాటక (140), ఒడిశా (105), వెస్ట్ బెంగాల్ (94), రాజస్థాన్ (76), ఉత్తర్ ప్రదేశ్ (73), హర్యానా (72), తమిళనాడు (70) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద శుక్రవారం ఉదయం 7 గంటల వరకు 180.97 కోట్ల (1,80,97,94,588) కరోనా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ