హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం నాడు ప్రయాణికులకు/ప్రజలకు కీలక సూచన చేశారు. షబ్-ఏ-బరాత్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి నగరంలో అన్ని ఫ్లైఓవర్లతో పాటుగా పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) మూసివేయబడుతుందని తెలిపారు. శనివారం తెల్లవారుజాము వరకు ఫ్లైఓవర్ల మూసివేత కొనసాగనుంది. అయితే గ్రీన్ ల్యాండ్స్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే, లంగర్ హౌస్ ఫ్లైఓవర్లకు మినహాయింపు ఇచ్చినట్టు తెలిపారు. షబ్-ఏ-బరాత్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటునట్టుగా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ