దేశంలో గత కొన్నిరోజులుగా రోజువారీగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 618 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,91,956కు చేరుకుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో 155, కర్ణాటకలో 81, కేరళలో 77, గుజరాత్ లో 58, తెలంగాణలో 52 వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. ఇక కరోనా వలన కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరాఖండ్ లో ఒకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,789కి పెరిగింది.
ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య మళ్ళీ నాలుగు వేలు (4197 (0.01%) దాటింది. అలాగే మరో 319 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,56,970 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.80 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా మార్చి 15, బుధవారం ఉదయం 8 గంటల వరకు 220.64 కోట్లకుపైగా (220,64,71,236) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE