ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022-23 సంవత్సరానికి గానూ రైతు భరోసా మొదటి విడత సాయాన్ని మే 16వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఈ పథకం కోసం ఈ ఏడాది 48.77 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించగా, వీరిలో 47.86 లక్షల మంది భూయజమానులు కాగా, 91 వేల మంది అటవీ భూ సాగుదారులున్నట్టు తెలుస్తుంది. అర్హులైన రైతుల జాబితాలను మే 6 నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. అలాగే మే 8వ తేదీ వరకు ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి, తుది జాబితాను ప్రకటించనున్నారు.
2019-20 సంవత్సరం నుంచి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు చేస్తుండగా, ఇప్పటికే 20 వేల కోట్లకు పైగా సాయాన్ని ఏపీ ప్రభుత్వం రైతులకు అందించింది. ఈ సంవత్సరం మొదటి విడతతో భాగంగా రూ.7,500 చొప్పున 48.77 లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.3,657.87 కోట్ల నగదును విడుదల చేయనున్నారు. రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం రూ.13750 అందిస్తుండగా, మొదటి విడతగా మేలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో సంక్రాతి సమయంలో రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ