స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-సబార్బిటల్ను విజయవంతంగా ప్రయోగించినందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరియు ఇన్-స్పేస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన రాకెట్ విక్రమ్-ఎస్ ఈరోజు శ్రీహరికోట నుండి బయలుదేరినందున భారతదేశానికి ఇది ఒక చారిత్రాత్మక క్షణం. భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ఘనతను ప్రారంభించినందుకు ఇస్రో మరియు ఇన్-స్పేస్ కు అభినందనలు. జూన్ 2020 నాటి ల్యాండ్మార్క్ అంతరిక్ష రంగ సంస్కరణలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న మన యువత యొక్క అపారమైన ప్రతిభకు ఈ సాఫల్యం నిదర్శనం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేస్తూ, “దేశానికి గర్వకారణం. విక్రమ్-ఎస్ అనే భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్గా తయారు చేసిన రాకెట్ను ఇస్రో ఈరోజు విజయవంతంగా ప్రయోగించింది. ఇది భారతదేశ వైజ్ఞానిక నైపుణ్యానికి, మన ప్రైవేట్ స్పేస్ పరిశ్రమ సామర్థ్యాలకు నిదర్శనం. ఇస్రో, ఇన్-స్పేస్, స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకు అభినందనలు” అని పేర్కొన్నారు. కాగా ఇన్-స్పేస్ అనే సింగిల్ విండో అటానమస్ ప్రభుత్వ సంస్థ దేశంలో ప్రైవేట్ సెక్టార్ స్పేస్ ఆధారిత కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటుగా, అనుమతించడం మరియు పర్యవేక్షించడం చేస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE