కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19, ఆదివారం నుంచి ఐపీఎల్-2021 రెండో దశ ప్రారంభం కానుంది. ఐపీఎల్-2021 ఇప్పటికే 29 మ్యాచులు పూర్తికాగా, యూఏఈలో మిగిలిన 31 మ్యాచులు జరనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు మొత్తం 27 రోజుల్లో దుబాయ్, షార్జా, అబుదాబి వంటి వేదికల్లో 31 ఐపీఎల్ మ్యాచులను నిర్వహించనున్నారు. కాగా సెప్టెంబర్ 19న దుబాయ్ లో జరగనున్న తొలిపోరులో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి.
ఐపీఎల్ మ్యాచ్ ల కోసం క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరోవైపు అక్టోబరు 10న క్వాలిఫయర్-1, అక్టోబరు 11న ఎలిమినేటర్, అక్టోబర్ 13న క్వాలిఫయర్-2, అక్టోబరు 15న ఫైనల్ మ్యాచులు నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం ఐపీఎల్ మ్యాచులు రాత్రి 7.30 గంటలకు, మరియు మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనున్నాయి.హోరాహోరీగా సాగనున్న ఈ సీజన్ లో ఏ జట్టు విజేతగా నిలవనుందో వేచిచూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ