తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిసింది. వారు సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతులై ఎప్పటిలాగే ప్రజా సేవలో నిమగ్నం కావాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను. వారికి కోవిడ్ స్వల్ప లక్షణాలే ఉన్నాయనీ, ఎలాంటి ఇబ్బందీ లేదని వైద్యులు చెప్పడం తెలంగాణ ప్రజలందరికీ ఊరటను కలిగిస్తుంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కరోనాతో ఎయిమ్స్ లో చేరినట్లు సమాచారం అందింది. ఒక ఆర్ధికవేత్తగా, దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించిన మన్మోహన్ సింగ్ ఈ వ్యాధి నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ, సినీ, క్రీడాప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సీఎం కేసీఆర్ కరోనాను నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ