జపాన్లో వైద్యంలో ఉపయోగించే నీళ్లతో చేసే ఈజీ థెరపీని జపనీస్ వాటర్ థెరపీ అంటారు. ఈ థెరపీలో జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి .. ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగుతారు. దీనివల్ల ఎన్నో రుగ్మతలు నయం అవుతాయని జపనీయుల నమ్మకం. అంతేకాదు ఈ థెరపీ వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి ఎన్నో వ్యాధులు తగ్గుతాయని అంటారు.
ఉదయం లేచాక బ్రష్ చేయడానికి ముందే.. 3 నుంచి 4 గ్లాసుల గోరువెచ్చని నీటిని త్రాగాలి. దీని తర్వాత 45 నిమిషాలు తర్వాత వరకూ ఏమీ తీసుకోకూడదు. ఆ తర్వాతే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. అయితే ఇలా పది రోజులు చేస్తే మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. అలాగే 20 రోజులు చేస్తే రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే 30 రోజులు ఇలా చేస్తూ టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్లోకి వస్తుంది. దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు.. కేలరీలు కూడా తగ్గుతాయి.
జపనీయులు నిద్ర లేవగానే గోరువెచ్చని లేదా వేడి నీటిని తాగడం వల్ల..శరీరంలో వాటర్ బ్యాలెన్స్ అవుతుంది. మంచి నీళ్లు తీసుకున్న 45 నిమిషాల వరకు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల.. శరీరం పోషకాలను సరైన మోతాదులో గ్రహిస్తుంది. అలాగే వారు ఆహారాన్ని నమిలి తింటారు..అలాగే భోజనం చేసేటప్పుడు నీటిని తాగరు.
జపనీస్ వాటర్ థెరపీలో ఎక్కువ నీళ్లు తాగడం వల్ల డీ హైడ్రేట్ అవకుండా కాపాడుకోవచ్చు. మెదడు కార్యకలాపాలు మెరుగవడం, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. మలబద్ధకం, తలనొప్పి , మూత్రపిండాల్లో రాళ్లు నివారించవచ్చు. ఎక్కువ మంది బాధపడే ఒబెసిటీ సమస్యకు ఈవేడినీళ్లతో చెక్ పెట్టొచ్చు. జపాన్లో ఎక్కువ మంది వాటర్ థెరపీని ఫాలో అవడం వల్లే జపనీయులు ఆరోగ్యంగా, అందంగా ఉంటారని వైద్యులు చెబుతుంటారు. అంతేకాదు ఫిట్గానూ, యవ్వనంగానూ కనిపిస్తారని అంటారు.
ఈ థెరపీ వల్ల కలుషితాలు బయటకు పోయి చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. స్కిన్ ప్లెక్సిబుల్గా ఉంటూ.. తొందరగా సాగిపోదు. దీనివల్ల వయసు త్వరగా కనిపించదు. అంతెందుకు మలబద్ధకం, క్యాన్సర్ వరకు ఎన్నో రోగాలను తగ్గించడంతో ఇప్పుడు చాలామంది జపనీస్ వాటర్ థెరపీని ఫాలో అయిపోతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE