దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITలు మరియు IITలలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో అడ్మిషన్ల కోసం నిర్వహించే జాతీయ స్థాయి పరీక్షల (JEE మెయిన్ 2022) షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ప్రతి సంవత్సరం నాలుగు దఫాలుగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ఈ సంవత్సరం మాత్రం రెండు సార్లు నిర్వహించనున్నారు. ఈ యేడాది ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఈరోజు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 1 నుంచి 31 వరకు జేఈఈకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అనంతరం మొదటి దశ పరీక్షలు ఏప్రిల్ 16-21 వరకు జరుగుతాయి. ఇక రెండో దశ పరీక్షలు మే 24-29 వరకు జరుగనున్నాయి.
JEE మెయిన్ 2022 సెషన్కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ – jeemain.nta.nic.inలో నమోదు చేసుకోవచ్చు. JEE మెయిన్ 2022 దరఖాస్తు ఫారమ్ ఆన్లైన్ మోడ్లో మార్చి 1 నుండి మార్చి 31 వరకు (సాయంత్రం 5 గంటల వరకు) అందుబాటులో ఉంటుంది. JEE మెయిన్ 2022 దరఖాస్తు ఫారమ్ లో ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం లేదని NTA స్పష్టం చేసింది. కాబట్టి, విద్యార్థులు JEE మెయిన్ అప్లికేషన్ ఫారమ్ 2022ను జాగ్రత్తగా నింపాలి. 2020, 2021లో ప్లస్ టు పాసైన విద్యార్థులతోపాటు ఈ ఏడాది ఇంటర్ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షకు అర్హులు. అలాగే, తెలుగుతో పాటు మొత్తం పదమూడు భాషల్లో ఈ ఎగ్జామ్ రాయటానికి వెసులుబాటు కల్పించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ