ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 68,568 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,337 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరులో 231, తూర్పుగోదావరిలో 198, ప్రకాశంలో 161, కృష్ణాలో 144, గుంటూరులో 141, నెల్లూరులో 139, పశ్చిమగోదావరిలో 128 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,38,690 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 9 మరణాలు చోటుచేసుకున్నాయి. కృష్ణాలో ముగ్గురు, చిత్తూరులో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ఒకరు, ప్రకాశంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14070 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,282 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,09,921 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,699 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ