భారత్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 18, 20, 22వ తేదీల్లో 3 టీ20ల సిరీస్, అలాగే నవంబర్ 25, 27, 30వ తేదీల్లో 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు (నవంబర్ 18, శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి వెల్లింగ్టన్ లోని స్కై స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తోలి టీ20లో తలపడనున్నాయి. న్యూజిలాండ్ తో సిరీస్ లకు నిర్ణీత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీలకు విశ్రాంతి కల్పించారు. దీంతో మూడు టీ20ల సిరీస్ కు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నారు. వారం క్రితమే టీ20 ప్రపంచకప్-2022లో భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్స్ లో వెనుదిరిగిన విషయం తెల్సిందే. తాజాగా ఈ టీ20 సిరీస్ ద్వారా క్రికెట్ అభిమానులను మళ్ళీ అలరించేందుకు ఇరు జట్లు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయి.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలో, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో భారత్ యువ జట్టు బరిలోకి దిగనుంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో ఉండడం భారత్ కు కలిసివచ్చే అవకాశం కాగా, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, దీపక్ హుడా సత్తా చాటాలని చూస్తున్నారు. బౌలర్లకు సంబంధించి తుది జట్టులో భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ కు చోటు దక్కనుంది. అలాగే వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్ ఎవరికైనా తుదిజట్టులో చోటుంటుందో వేచిచూడాలి. ఇక ట్రెంట్ బౌల్ట్ మినహా కెప్టెన్ విలియంసన్ నేతృత్వంలో టీ20 ప్రపంచకప్-2022లో ఆడిన న్యూజిలాండ్ జట్టే అటుఇటుగా బరిలో దిగనుంది.
భారత్ టీ20 జట్టు అంచనా: శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్, దీపక్ హుడా/వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్ టీ20 జట్టు అంచనా: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE