పాకిస్థాన్ రాజకీయాలు గత కొన్ని రోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ఒక కీలక ఘట్టానికి వేదికయింది పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ. ఇమ్రాన్ ఖాన్ స్థానంలో షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనూహ్య నిష్క్రమణ తర్వాత షెహబాజ్ షరీఫ్ దేశ ప్రధానిగా నేడు ఎంపికయ్యారు. ఈయన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు, ఇంకా పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష పిఎంఎల్-ఎన్ నాయకుడు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి షెహబాజ్ షరీఫ్ ను నూతన ప్రధానమంత్రిగా ఎన్నుకున్నాయి. విశ్వాస పరీక్షలో షరీఫ్ కు సంపూర్ణ మద్దతు లభించింది. కాగా పీటీఐ కూడా తొలుత తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా షా మహమూద్ ఖురేషీని నిలబెట్టింది.
అయితే కొత్త ప్రధాని ఎన్నికకు ముందు ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇమ్రాన్ పార్టీ ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ (పీటీఐ) సభలో ఓటింగ్ను బహిష్కరించింది, ఆ పార్టీ చట్టసభ సభ్యులు వాకౌట్ చేశారు. విశ్వాస పరీక్షకు ముందు జరిగిన పార్టీ శాసనసభ్యుల సమావేశంలో పీటీఐ దీనిని బహిష్కరించాలని నిర్ణయించుకుంది. అయితే, తాజాగా ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్ పై కొన్ని అవినీతి ఆరోపణలు, వాటికి సంబంధించి పలు కేసులు కోర్టులలో విచారణలో ఉండటం గమనార్హం. దీనిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. “16 వేలకోట్ల రూపాయల అవినీతి, మరో 8 వేల కోట్ల అవినీతి కేసులు ఉన్న ఒక వ్యక్తిని ఈ దేశ ప్రధానిగా ఎన్నుకోవడం.. దేశానికి ఇంతకంటే పెద్ద అవమానం మరొకటి ఉండదు. ఇలాంటి అవినీతిపరులు ఉన్న ఈ జాతీయ లో ఉండలేను, అందుకే అసెంబ్లీకి రాజీనామా చేస్తున్నాను” అని ఇమ్రాన్ ఖాన్ పిటిఐ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ