హంగేరీ సార్వత్రిక ఎన్నికల అధికారిక ఫలితాలు వెలువడ్డాయి. హంగేరి ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ నేతృత్వంలోని ఫిడెస్జ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి నాల్గవసారి అధికారం చేప్పట్టబోతోంది. ఈ నేపథ్యంలో హంగేరీ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్, హంగేరీలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో మీరు విజయం సాధించినందుకు అభినందనలు. సన్నిహిత మరియు స్నేహపూర్వకమైన భారతదేశం-హంగేరీ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, మీతో కలిసి పనిచేయడం కొనసాగించడానికి ఎదురుచూస్తున్నాము” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో యుద్ధ పరిస్థితుల కారణంగా ఇటీవల హంగేరి మీదుగా వేలాది మంది భారతీయ వైద్య విద్యార్థులను/పౌరులను సురక్షితంగా తరలించడానికి హంగేరి ప్రభుత్వం భారత్ ప్రభుత్వానికి పూర్తి తోడ్పాటు అందించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ