డెన్మార్క్ దేశ ప్రధాన మంత్రిగా మళ్లీ ఎన్నికైనందుకు మెట్టె ఫ్రెడరిక్సెన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “డెన్మార్క్ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికైనందుకు మెట్టె ఫ్రెడెరిక్సెన్కు హృదయపూర్వక అభినందనలు. భారతదేశం-డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ను బలోపేతం చేయడంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని కొనసాగించాలని నేను ఎదురు చూస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
డెన్మార్క్ లో నవంబర్ 1న జరిగిన అసంకల్పిత ఎన్నికల తర్వాత, ఎట్టకేలకు ఆరు వారాల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అనేక చర్చల అనంతరం లెఫ్ట్-రైట్ కూటమి ఏర్పడిందని ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడరిక్సెన్ మంగళవారం ప్రకటించారు. సోషల్ డెమోక్రటిక్ నాయకురాలు ఫ్రెడరిక్సెన్ మంగళవారం ప్రకటన చేస్తూ, ద్వైపాక్షిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే తన నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటులో సంకీర్ణంపై డెన్మార్క్ రాణి మార్గరెత్ను కలిసి వివరించిన అనంతరం, లిబరల్స్, సోషల్ డెమోక్రాట్లు, మితవాదులతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని ఫ్రెడరిక్సెన్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE