భారత్, బంగ్లాదేశ్ మధ్య ‘మైత్రి సేతు’ బ్రిడ్జిను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. త్రిపుర మరియు బంగ్లాదేశ్ సరిహద్దు మధ్య ప్రవహించే ఫెని నదిపై 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను నిర్మించారు భారత్, బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ద్వైపాక్షిక, స్నేహపూర్వక సంబంధాలకు ప్రతీకగా ఈ బ్రిడ్జికి ‘మైత్రి సేతు’ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ బ్రిడ్జి కనెక్టివిటీ భారత్, బంగ్లాదేశ్ మధ్య స్నేహాన్ని బలోపేతం చేయడమే గాకా, వ్యాపారానికి కూడా బలమైన అనుసంధానమని రుజువు చేస్తోందని అన్నారు. ఈ ప్రాంతమంతా ఈశాన్య భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య కారిడార్గా అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. ఇది దక్షిణ అస్సాం, మిజోరాం, మణిపూర్, త్రిపురలతో పాటు బంగ్లాదేశ్ మరియు సౌత్-ఈస్ట్ ఆసియా కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని చెప్పారు.
ఈ బ్రిడ్జి బంగ్లాదేశ్ లో కూడా ఆర్థిక కార్యకలాపాలకు ఉత్సాహాన్ని ఇస్తుందని, ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో సహకరించినందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ ప్రధానికి షేక్ హసీనాకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా వీడియో ద్వారా సందేశం అందించారు. మరోవైపు త్రిపురలో పలు బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రంలో త్రిపుర గవర్నర్ రమేష్ బయోస్, త్రిపుర ముఖ్యమంత్రి బిపీలాబ్ కుమార్ దేబ్ హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ