ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం న్యూఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనం పైకప్పు పై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ నూతన పార్లమెంటు పైకప్పుపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ఘనత తనకు దక్కిందని అన్నారు. అలాగే నూతన పార్లమెంటు నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్లు, ఉద్యోగులు, వర్కర్స్ తో కూడా ప్రధాని మోదీ సంభాషించారు. “పార్లమెంటు నిర్మాణంలో పాలుపంచుకున్న శ్రమజీవులతో నేను సంభాషించాను. వారి ప్రయత్నాలకు మేము గర్విస్తున్నాము మరియు మన దేశానికి వారు చేసిన సహకారాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాము”అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నం మొత్తం 9500 కిలోల బరువుతో 6.5 మీటర్ల ఎత్తుతో కాంస్యంతో తయారు చేయబడింది. ఇది నూతన పార్లమెంట్ భవనం యొక్క సెంట్రల్ ఫోయర్ పైభాగంలో ఏర్పాటు చేయబడింది. జాతీయ చిహ్నానికి సపోర్ట్ గా 6500 కిలోల బరువున్న ఉక్కుతో కూడిన సహాయక నిర్మాణం కూడా నిర్మించబడిందని తెలిపారు. జాతీయ చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY