ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మందిని మిషన్ మోడ్ లో రిక్రూట్మెంట్ చేయాలని వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలకు ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ప్రధాన మంత్రి(పీఎంఓ) కార్యాలయం ట్వీట్ చేసింది. “ప్రధాని మోదీ అన్ని శాఖలు మరియు మంత్రిత్వ శాఖలలో మానవ వనరుల స్థితిని సమీక్షించారు మరియు రాబోయే 1.5 సంవత్సరాలలో 10 లక్షల మందిని మిషన్ మోడ్లో ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేయాలని ఆదేశించారు” అని ప్రధాన మంత్రి కార్యాలయం తెలియజేసింది.
దేశంలో నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు గత కొంతకాలంగా పెద్దఎత్తున విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా ప్రధాని మోదీ ఆదేశాలతో ఉద్యోగ నియామకాలపై త్వరలోనే ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY