ప్రధాని నరేంద్ర మోదీ రేపు (జూన్ 10, శుక్రవారం) గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 10:15 గంటలకు నవ్సారిలో ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’ సందర్భంగా ప్రధాని మోదీ 3050 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు కనెక్టివిటీని పెంచడం మరియు జీవన సౌలభ్యాన్ని పెంపొందించడంతో పాటుగా ఆ ప్రాంతంలో నీటి సరఫరాను మెరుగుపరచడంలో సహాయపడతాయని తెలిపారు.
అనంతరం నవ్సారిలో ఏఎం నాయక్ హెల్త్కేర్ కాంప్లెక్స్ మరియు నిరాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించనున్నారు. హెల్త్కేర్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ ఫంక్షన్కు కూడా ప్రధాని హాజరవుతారు. అక్కడ వర్చువల్ విధానంలో ఖరేల్ ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ను ప్రారంభించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే సాయంత్రం బోపాల్లో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY