రాహుల్‌ గాంధీతో ప్రశాంత్‌ కిషోర్‌ కీలక భేటీ, రాజకీయవర్గాల్లో చర్చ

All Three Gandhis Met With Prashant Kishor, Congress Leader Rahul Gandhi, Delhi, Mango News, Poll Strategist Prashant Kishor, Poll Strategist Prashant Kishor Meets Congress Leader Rahul Gandhi, Poll Strategist Prashant Kishor Meets Congress Leader Rahul Gandhi Today at Delhi, Prashant Kishor Meets Congress Leader Rahul Gandhi, Prashant Kishor meets Congress leaders Rahul, Prashant Kishor meets Rahul, Prashant Kishor meets Rahul & Priyanka, Prashant Kishor Meets Rahul Gandhi, Prashant Kishor meets Rahul Gandhi in Delhi, Prashant Kishor meets Rahul Gandhi Priyanka Gandhi, priyanka gandhi

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మంగళవారం నాడు కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు, కీలక నేత రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో ఈ భేటీ జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కొత్త ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇటీవల ప్రశాంత్‌ కిషోర్‌ పలుమార్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి హరీష్ రావత్ సహా పలువురు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ భేటీలో చర్చలు వెల్లడి కావాల్సి ఉంది.

కాగా పంజాబ్‌ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం అమరీందర్‌ సింగ్‌, నవజోత్‌ సింగ్‌ సిద్దూల మధ్య నెలకున్న విభేదాలను తొలగించేందుకు చర్చలు జరిపారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమావేశం అనంతరం హరీష్ రావత్ మీడియాతో మాట్లాడుతూ, పంజాబ్ రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీని కలవలేదని పేర్కొన్నారు. జాతీయ నాయకుడైన రాహుల్ గాంధీని పలువురు నాయకులు కలుసుకుని వారి అభిప్రాయాలను తెలియజేస్తుంటారని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 6 =