ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో ఈ భేటీ జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కొత్త ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇటీవల ప్రశాంత్ కిషోర్ పలుమార్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి హరీష్ రావత్ సహా పలువురు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ భేటీలో చర్చలు వెల్లడి కావాల్సి ఉంది.
కాగా పంజాబ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్దూల మధ్య నెలకున్న విభేదాలను తొలగించేందుకు చర్చలు జరిపారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమావేశం అనంతరం హరీష్ రావత్ మీడియాతో మాట్లాడుతూ, పంజాబ్ రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీని కలవలేదని పేర్కొన్నారు. జాతీయ నాయకుడైన రాహుల్ గాంధీని పలువురు నాయకులు కలుసుకుని వారి అభిప్రాయాలను తెలియజేస్తుంటారని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ