2 కి.మీ నడిచి పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వామివారికి ప్రత్యేక పూజలు

President Droupadi Murmu Walks Down 2 km upto Lord Shree Jaganath Temple Kneels Down at Lion’s Gate,President Droupadi Murmu,Walks Down 2 km Shree Jaganath Temple,Shree Jaganath Temple,Mango News,Mango News Telugu,Lord Shree Jaganath Temple,Lord Shree Jaganath, Puri Jaganath Temple,Kneels Down at Lion’s Gate,Droupadi Murmu Kneels Down at Lion’s Gate, Kneels Down at Lion’s Gate,President Droupadi Murmu Latest News And Updates

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంత రాష్ట్రమైన ఒడిశాలో రెండు రోజుల పర్యటన చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆమె గురువారం పూరీలోని జగన్నాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము హెలికాఫ్టర్ దిగిన ప్రాంతం నుంచి ఆలయం వరకు రెండు కిలోమీటర్లు నడిచుకుంటూ స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. ఈ సమయంలో వందలాది మంది భక్తులు ఆమెకు స్వాగతం పలుకగా ఆమె వారి వైపు తిరిగి చేతులు ఊపూతూ అభివాదం చేసుకుంటూ నడక కొనసాగించారు. ఇక దీనిని రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు ఇతర సీనియర్ అధికారులతో కలిసి కాలినడకన ఆలయానికి వెళుతున్నట్లు వీడియో చూపించింది.

ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ము స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక దర్శనం అనంతరం ద్రౌపది ముర్ము భువనేశ్వర్‌లో ఆమె గౌరవార్థం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో పాల్గొన్నారు. అలాగే ఒడిశా పర్యటన సందర్భంగా ఆమె ముర్ము శుక్రవారం ఇతర కార్యక్రమాలకు హాజరవడంతో పాటు భువనేశ్వర్‌లో ఆమె విద్యనభ్యసించిన పాఠశాలను కూడా సందర్శించనున్నారు. జూలైలో రాష్ట్రపతి అయిన తర్వాత ముర్ము రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ముర్ము పర్యటన సందర్భంగా రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని అన్ని కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హాఫ్ డే సెలవు ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + three =