మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాల ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్ర ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాష్ట్రాలు భారతదేశ అభివృద్ధికి శక్తివంతమైన కృషి చేస్తున్నాయి. వారి నిరంతర పురోగతి కోసం ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఆ మూడు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర ప్రజలకు శుభాకాంక్షలు. సహజ సంపదతో నిండిన ఈ రాష్ట్రాలు మన ఈశాన్య ప్రాంతపు శక్తివంతమైన సంస్కృతి మరియు ప్రత్యేక సంప్రదాయాలను సూచిస్తాయి. సంతోషకరమైన మరియు సంపన్నమైన భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాల పౌరులకు నా శుభాకాంక్షలు” అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF