పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. రేపు (గురువారం) ఆయన డాక్టర్ గురుప్రీత్ కౌర్ను వివాహం చేసుకోనున్నారు. కుటుంబసభ్యులు, పలువురు మిత్రుల సమక్షంలో చండీగఢ్లోని ఆయన నివాసంలో ప్రైవేట్ కార్యక్రమంగా ఈ వివాహం జరుగనుంది. అయితే ఆయనకు ఇది ద్వితీయ వివాహం కావడం విశేషం. కాగా సీఎం భగవంత్ మాన్కు ఇంతకుముందే ఇందర్ప్రీత్ కౌర్తో పెళ్లయింది.2014లో ఆయన ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఎన్నికల ప్రచారానికి ఆమె కూడా వచ్చారు. అయితే ఆరేళ్ల వివాహ బంధం తర్వాత ఇందర్పీత్ర్ కౌర్తో ఆయన విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారితో కలిసి ఇంద్రపీత్ సింగ్ అమెరికాలో ఉంటున్నారు.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన ప్రకారం.. భగవంత్ మాన్ మళ్లీ పెళ్లి చేసుకోవాలని కోరుకున్న ఆయన తల్లి, సోదరి స్వయంగా వధువును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వారికి తెలిసిన వైద్యురాలు గురుప్రీత్ కౌర్ను ఈ వివాహానికి ఒప్పించినట్లుగా సన్నిహితులు చెప్తున్నారు. మరోవైపు ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రేపు జరిగే ఈ వివాహ కార్యక్రమానికి కుటుంబసభ్యులతో కలిసి రానున్నట్టు తెలుస్తోంది. అలాగే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. వీరితో పాటు పంజాబ్ క్యాబినెట్ మంత్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు హాజరవుతారని సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ