ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను సీఎం పీఠం కోసం 36 స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, బీజేపీ 47 స్థానాలు దక్కించుకుంది. అయితే ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన భువన్ చంద్ర కప్రీ చేతిలో 6,579 ఓట్ల తేడాతో పుష్కర్ సింగ్ ధామి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ తదుపరి సీఎంగా బీజేపీ అధిష్టానం ఎవరికీ అవకాశమిస్తుందనే అంశంపై గత 10 రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది.
ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మరోసారి పుష్కర్ సింగ్ ధామికే అవకాశం ఇస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం డెహ్రాడూన్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పరిశీలకులుగా కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, మీనాక్షి లేఖీ, ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలంతా తమ శాసనసభాపక్ష నేతగా పుష్కర్ సింగ్ ధామిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా మార్చి 23న ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ