దేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ క్రమంగా విజృంభిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ మార్చ్ 27, శుక్రవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాజా నిర్ణయాలను వెల్లడించారు.
ఆర్బీఐ గవర్నర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- మార్చ్ 24, 26, 27 తేదీల్లో మానిటరీ పాలసీ కమిటీ తాజా పరిస్థితులపై సమీక్ష జరిపింది.
- దేశంలో ఆర్థిక సుస్థిరత ఉండేలా చర్యలు చేపట్టాం. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది.
- రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గింపు. దీంతో ప్రస్తుత రెపో రేటు 4.4 శాతంగా ఉంది.
- అలాగే రివర్స్ రెపో రేటు 90 పాయింట్లు కుదింపు. ప్రస్తుత రివర్స్ రెపోరేటు నాలుగు శాతం.
- అన్ని రకాల ఈఎంఐలపై (లోన్లు ) మూడు నెలల పాటు మారిటోరియం.
- ఈఎంఐలు కట్టకపోయినా సిబిల్ స్కోర్ పై ప్రభావం ఉండదు.
- ఎల్ఏఎఫ్( లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ) 90 బేసిస్ పాయింట్స్ తగ్గింపు. ప్రస్తుత ఎల్ఏఎఫ్ 4 శాతం.
- బ్యాంకుల సిఆర్ఆర్ 100 బేసిస్ పాయింట్లు తగ్గింపు. ప్రస్తుత సిఆర్ఆర్ 3 శాతం.