ఉక్రెయిన్పై రష్యా దాడిలో ఒక భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే, కైవ్ నగరంలో మరో భారతీయ విద్యార్థి రష్యా సైనికులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డారు. ఈ రోజు కైవ్ నుండి బయలుదేరిన ఒక భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిపినట్లు తెలిసింది. అయితే, బుల్లెట్ గాయం అయిన విద్యార్థిని చికిత్స నిమిత్తం తిరిగి కైవ్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆ విద్యార్థికి ట్రీట్మెంట్ జరుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జనరల్ వీకే సింగ్ చెప్పారు. కైవ్లోని భారత రాయబార కార్యాలయం ఉక్రెయిన్లోని భారతీయులను వెంటనే దేశాన్ని ఖాళీ చేయమని ఇప్పటికే సూచించిందని మంత్రి తెలిపారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు పర్యవేక్షణ కోసం సింగ్ ప్రస్తుతం పోలాండ్లో ఉన్నారు.
ఉక్రెయిన్లో భారతీయుల తరలింపును పర్యవేక్షించేందుకు ఈ వారం ప్రారంభంలో తూర్పు యూరప్కు వెళ్లిన నలుగురు కేంద్ర మంత్రుల్లో వీకే సింగ్ కూడా ఉన్నారు. హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, మరియు కిరణ్ రిజిజు మిగిలిన ముగ్గురు ప్రత్యేక బృందంలో ఉన్నారు. వీరు ప్రస్తుతం ఉక్రెయిన్ దేశంలో చిక్కుకుపోయిన వారితో సహా ఉక్రెయిన్ చుట్టుప్రక్కల ఉన్న దేశాలకు చేరుకుంటున్న భారతీయ పౌరుల తరలింపును సమన్వయం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఉక్రెయిన్లో జరిగిన యుద్ధంలో కర్ణాటకలోని హవేరీ జిల్లాకు చెందిన నవీన్ శేఖరప్ప అనే ఒక వైద్య విద్యార్థి మంగళవారం తూర్పు ఉక్రెయిన్ నగరంలో ఖార్కివ్లో ఒక తీవ్రమైన బాంబు దాడిలో మరణించిన విషయం తెలిసిందే. నవీన్ ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ