బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో అరెస్ట్ చోటు చేసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ స్నేహితుడు, రూమ్మేట్ సిద్ధార్థ్ పిథానిని ఎన్సీబీ అరెస్టు చేసింది. అతన్ని హైదరాబాద్ లో అరెస్టు చేసి శుక్రవారం నాడు ముంబయికి తరలించారు. అనంతరం సిద్ధార్థ్ పిథాని కోర్టులో ప్రవేశపెట్టగా, జూన్ 1 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
సిద్ధార్థ్ పిథాని పలు సమన్లుకు సమాధానం ఇవ్వకుండా దాటవేయడంతో, పోలీసు బృందం అతని కోసం వెతకడం ప్రారంభించిందని అధికారులు వెల్లడించారు. మాదకద్రవ్యాల సరఫరాదారులతో కొంత సంబంధం ఉన్నట్టు ఫోన్ మరియు వాట్సాప్ వివరాలు ద్వారా ఎన్సీబీకి ఆధారాలు లభించిన నేపథ్యంలోనే సిద్ధార్థ్ పిథాని అరెస్ట్ చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు గతంలో కూడా సుశాంత్ సింగ్ మృతికి సంబంధించి ముంబయి పోలీసులు, సీబీఐ అధికారులు సిద్ధార్థ్ పిథానిని పలుసార్లు ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ