కేంద్రప్రభుత్వ ఫింఛనుదారులకు కేంద్రం శుభవార్త వినిపించింది. ఫింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రతి సంవత్సరం కేంద్రప్రభుత్వ ఫింఛనుదారులు నవంబర్ 30వ తేదీ లోపుగా ఈ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఫించను పొందటంలో ఎలాంటి ఆటంకాలు కలుగకుండా మరియు ఫించను ప్రక్రియ సాఫీగా సాగేందుకు ఫింఛనుదారులకు ఇది తప్పనిసరి. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు ఉండటం తెలిసిందే. ఫింఛనుదారులు వృద్ధాప్యం కారణంగా ఇప్పటి పరిస్థితులలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే ప్రక్రియ కోసం ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై కేంద్రప్రభుత్వ ఫింఛనుదారులు ఆనందం తెలియజేస్తున్నారు. తమ సమస్యలను గుర్తించి కేంద్రం గడువును పొడిగించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ