జమ్ము కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో మే 6, బుధవారం నాడు జరిగిన ఓ ఆపరేషన్ లో హిజ్బుల్ ముజహిదీన్ టాప్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రియాజ్ నైకూ మరణించాడు. ముందుగా తన స్వగ్రామమైన బీగ్పోరా కు రియాజ్ వచ్చాడన్న సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి జరిపిన కాల్పుల్లో రియాజ్ నైకూ హతమైనట్లు అధికారులు ధ్రువీకరించారు.
గత కొన్ని సంవత్సరాలుగా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉంటూ భద్రతా దళాల కన్నుగప్పి తిరుగుతున్న రియాజ్ ఎట్టకేలకు హతమయ్యాడు. మరోవైపు పుల్వామా జిల్లా షార్షలీలో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మిలిటెంట్లు హతమయినట్టుగా ప్రకటించారు. మూడు రోజుల క్రితం కశ్మీర్లోని హంద్వారాలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందన తప్పదని, గట్టిగా సమాధానం చెప్పేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని మరోసారి నిరూపించినట్లయింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu