కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి జూన్ 30, సోమవారం రాత్రి అన్లాక్ -2 విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో మరికొన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి నిచ్చారు. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసి, సంబంధిత మార్గదర్శకాలను ప్రకటించింది.
అన్లాక్ 2.0 లో అనుమతి లేనివి – (జూలై 31 వరకు నిషేధం):
- కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చినవి మినహా ప్రయాణీకుల అంతర్జాతీయ విమాన ప్రయాణం
- మెట్రో రైళ్లు
- సినిమా థియేటర్స్
- జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్ మెంట్ పార్క్స్, బార్లు మరియు ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్ళు
- సామాజిక రాజకీయ/ క్రీడలు / వినోదం / విద్యా / సాంస్కృతిక మతపరమైన కార్యక్రమాలు, బహిరంగ సభలు
కేంద్ర ప్రకటించిన ఇతర మార్గదర్శకాలు :
–> రాత్రి పూట కర్ఫ్యూ: రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు
–> కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న శిక్షణా సంస్థలు జూలై 15 నుంచి ప్రారంభించేందుకు అనుమతి.
–> బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, ప్రయాణ సమయంలో ముఖానికి మాస్క్లు తప్పనిసరిగా పెట్టుకోవాలి.
–> దుకాణదారులు, వ్యాపారాలు కేంద్ర మార్గదర్శకాలు పాటించాలి.
–> గుంపులు గుంపులుగా జనం గుమికూడడంపై నిషేధం.
–> వివాహ, ఇతర సంబంధిత కార్యక్రమాలకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి.
–> అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 20 మందికి మాత్రమే అనుమతి.
–> కార్యాలయాలు, ఎక్కువ మంది సంచరించే ప్రాంతాలను శానిటైజషన్ చేయాలి.
–> బయట ప్రదేశాల్లో 6 ఆరడుగుల తప్పనిసరి భౌతికదూరం పాటించాలి.
–> బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం.
–> కేంద్ర, రాష్ట్ర విధివిధానాలను అన్ని సంస్థలు పాటించాలి, ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu