రష్యా ఆర్డీఐఎఫ్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ శనివారం నాడు భారత్ కు చేరుకుంది. రష్యాలోని మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో 1.5 లక్షల స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ డోసులు హైదరాబాద్ కు చేరుకున్నాయి. మరో మూడు మిలియన్ల డోసులు కూడా ఈ నెలలోనే రానున్నట్టు తెలుస్తుంది. దేశంలో మూడోదశ వ్యాక్సినేషన్ లో భాగంగా 18-14 ఏళ్ల వారికీ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో కోవాక్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ లతో పాటుగా స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడం ఊరట కల్గించనుంది.
ముందుగా రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కు సంబంధించి దేశంలో ఉత్పత్తి, అమ్మకాలపై డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడో పేజ్ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ వ్యాక్సిన్ యొక్క అత్యవసర ఉపయోగం కోసం డాక్టర్ రెడ్డీస్ సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ పరిశీలన చేసి ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం డీసీజీఐకి సిఫార్సు చేసింది. అనంతరం డీసీజీఐ కూడా ఆమోదం తెలపడంతో దేశంలో వినియోగం కోసం ఆమోదం పొందిన మూడో వ్యాక్సిన్ గా స్పుత్నిక్-వి నిలిచింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ