కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 22,683 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 847 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 3.73 శాతంగా నమోదైంది. అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65,25,835 కు చేరుకుంది. ఇక గత 24 గంటల్లో కొత్తగా కరోనా వలన ముగ్గురు మరణించినట్టు తెలిపారు.
అయితే పత్రాలు ఆలస్యంగా అందినందున గత 24 గంటల్లో మునుపటి రోజులకు సంబంధించిన 12 మరణాలను, అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 44 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 67,197 కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 1,321 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 64,51,349 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 6,464 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ