జూలై 5వ తేదీన బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 5న జరిగే బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానిస్తూ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వాన పత్రికను అందచేసారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి సహా ధర్మకర్త మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY