బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ను హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా కేంద్రప్రభుత్వం నియమించగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన బండారు దత్తాత్రేయను, హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అక్కడి రాజ్ భవన్ అధికారులు కలుసుకుని నియామక ఉత్తర్వులు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి బండారు దత్తాత్రేయ హిమాచల్ప్రదేశ్ కు బయలుదేరి వెళ్లారు.
ముందుగా నిర్ణయించుకున్న విధంగానే సెప్టెంబర్ 11 న ఉదయం 10.30 గంటలకు ఆయన గవర్నర్ గా ప్రమాణం చేయనున్నారు. బండారు దత్తాత్రేయ గవర్నర్ గా నియమితులైన విషయం తెలియగానే అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆయనకు శుభాబినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ, హిమాచల్ప్రదేశ్ ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని, గవర్నర్ గా ప్రభావవంతముగా పని చేస్తానని పేర్కొన్నారు.
[subscribe]
[youtube_video videoid=OYHyP3P0aHg]