తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్ లో ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన బీజేపీ నాయకత్వం ఆధ్వర్యంలో పూర్తిగా సమాయత్తమై ఉన్నామని చెప్పారు. దానికి తోడుగా పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. 13 లేదా 14 నుంచి అనుమతులు తీసుకుని పాదయాత్ర ప్రారంభిస్తానని ఈటల రాజేందర్ తెలిపారు. నియోజకవర్గంలోని కమలాపుర్ మండలంలోని గోపాలపురం నుండి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నామని, ఈ పాదయాత్రలో దాదాపు 99 శాతం గ్రామాలను కవర్ చేస్తామని చెప్పారు. వర్షాకాలం వలన ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసుకుని పార్టీనాయకులు, యువకులు, విద్యార్థులుతో ఈ పాదయాత్ర కొనసాగనుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ