మునుగోడు నియోజకవర్గంలో మంగళవారం పలివెల గ్రామంలో చోటుచేసుకున్న దాడి ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. బుధవారం నాంపల్లిలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా తనపై పక్కా స్కెచ్ ప్రకారమే మునుగోడులో తనపై దాడి జరిగిందని, తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తన నుంచి ఒక్క రక్తపు బొట్టు కారినా దానికి సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. హుజూరాబాద్లో అవసరం లేకున్నా అనేక మందికి గన్ లైసెన్సులు ఇచ్చారని, ఇలాంటివాటికి బెదిరేది లేదని స్పష్టం చేశారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ ఓటమితో తనపై కేసీఆర్ పగ పట్టారని, అసెంబ్లీలో కూడా మాట్లాడనీయకుండా గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. గ్రామంలో తన సతీమణి ప్రచారం చేస్తుంటే అడ్డుకున్నారని, కానీ తాము మాత్రం ఎక్కడ అధికార పార్టీ నేతలను అడ్డుకోలేదని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE